
రైతు‘కు’ భరోసా
● ఒకే ఒక్కడు
జిల్లాలో రైతుభరోసా కేంద్రాలు
నియోజకవర్గం రైతుభరోసా కేంద్రాల
సంఖ్య
చిత్తూరు 25
పలమనేరు 88
పూతలపట్టు 95
గంగాధరనెల్లూరు 86
కుప్పం 77
పుంగనూరు 99
నగరి 56
మొత్తం 526
చిత్తూరు కలెక్టరేట్ : రైతన్నలకు తోడుగా ఉండేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ఆరంభించింది. ఈ కేంద్రాలు గత ఐదేళ్ల పాటూ అన్నదాతకు తోడుగా నిలిచాయి. సాగుదారుల ప్రతి అవసరాన్నీ తీర్చాయి. పల్లెపట్టున విశేష సేవలందించాయి. తెల్లవారగానే మండల కేంద్రానికో.. జిల్లా కేంద్రానికో రైతులు పరుగులు తీయాల్సిన దుస్థితి తొలగిపోయింది. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవస్థలు తప్పిపోయాయి. రవాణా ఖర్చుతో పాటు సమయం ఆదా అయ్యింది. సాగు ఉత్పాదకాల కోసమే కాకుండా సలహాలు, సూచనల కోసం రైతన్నలు ఆర్బీకేల తలుపు తట్టేవారు. అలాంటి ఆర్బీకే కేంద్రాలను నెలకొల్పిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సేవలను జిల్లా రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కూటమి పాలనలో రైతుభరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

రైతు‘కు’ భరోసా