● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చేయాలంటూ ధర్నా ● రోడ్డుపై బైఠాయించి నిరసన ● మోకాళ్ల పై కూర్చొని నినాదాలు ● బారికేడ్లు పెట్టి మోహరించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చేయాలంటూ ధర్నా ● రోడ్డుపై బైఠాయించి నిరసన ● మోకాళ్ల పై కూర్చొని నినాదాలు ● బారికేడ్లు పెట్టి మోహరించిన పోలీసులు

Jun 9 2025 6:57 AM | Updated on Jun 9 2025 6:57 AM

● ఉద్

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ

చిత్తూరు కార్పొరేషన్‌ : తమ సమస్యల పరిష్కారం కో సం ఉపాధ్యాయులు ఉద్యమించారు. బదిలీ కౌన్సెలింగ్‌ జరుగుతున్న లోటుపాట్లను సరిదిద్దాల్సిన ప్రభు త్వం పట్టనట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. డీఈఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయులు ఆదివారం ఉద యం జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. వారిని నిలువరిచేందుకు పోలీసులు భారీగా మోహరించారు. వారిని కార్యాలయంలోకి పంపకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో అయ్యోర్లు రోడ్డు పై బైఠాయించారు. మండు టెండలో మోకాళ్ల పై నిల్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఓ ఉపాధ్యాయుడు తల కిందులుగా నిరసన తెలిపాడు. వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానం రద్దు చేయాలని నినదించారు. కాని పక్షంలో సోమవారం నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

రీ కౌన్సెలింగ్‌ జరిపి న్యాయం చేయాలి

ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి వెబ్‌ కౌన్సెలింగ్‌ వద్దని మాన్యూవల్‌ కౌన్సెలింగ్‌ కావాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. వెబ్‌ ఆప్షన్‌లో వచ్చిన లోపాలను సవరించాలని నినాదాలు చేశారు. నష్టపోయిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రీ కౌన్సెలింగ్‌ జరిపి న్యాయం చేయాలని కోరారు. 20 రోజుల ముందు జరిగిన చర్చల్లో మాన్యువల్‌ కౌన్సెలింగ్‌కు విద్యాశాఖ అంగీకరం తెలిపిందన్నారు. కానీ మళ్లీ వెబ్‌ ఆప్షన్‌ పెట్టుకోవాలని కోరడం ఏమిటన్నారు. దీంతో ఎస్జీటీలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ప్రధానంగా సీనియర్లకు అన్యాయం జరుగుతోందని అంతా గందరగోళంగా మారిందన్నారు. ఈ విధానం వల ఉపాధ్యాయులు నష్టపోతున్నారన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు.

టీచర్ల డిమాండ్లు ఇవీ..

ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. క్లస్టర్‌ లెవల్‌ అకడమిక్‌ టీచర్‌ ఖాళీలతో కలిపి ముందుగా ఇచ్చిన ఆప్షన్‌ మేరకు బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలి. రిక్వెస్ట్‌ బదిలీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ బదిలీల వెబ్‌ సైట్‌లో తప్పనిసరిగా బదిలీగా చూపడం సరికాదు. ఫైనల్‌ సీనియర్‌ జాబితా విడుదల చేయకుండా ఉపాధ్యాయుల గ్రీవెన్స్‌ పరిషార్కం కాకుండానే ఆప్షన్‌ పెట్టుకోవాలని ఒత్తిడి చేయడం అన్యాయం. ప్రధానోపాధ్యాయులు, ఉపాఽ ద్యాయులు ఎంపిక చేసుకున్న ఖాళీలను కేటాయించకపోవడంతో తర్వాత సదరు ఖాళీలను పదోన్నతుల్లో చూపడం వల్ల సీనియర్‌ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. కొన్ని ఖాళీలను సీనియర్‌ ఉపాధ్యాయులు ముందుగా బదిలీ కోసం ఎంపిక చేసుకున్నప్పటికీ వారికి కేటాయించకుండా జూనియర్లకు ఇస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఒకే పోస్టును ఇద్దరికి కేటాయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, రెడ్డప్పనాయుడు, మణికంఠన్‌, చెంగల్రాయమందడి, మోహన్‌, ముత్యాలరెడ్డి, శేఖర్‌, సోమశేఖర్‌నాయుడు, భాస్కర్‌ పాల్గొన్నారు.

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలి

గతంలో జరిగిన చర్చల్లో ఎస్జీటీలకు మ్యానువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. ఇప్పుడు అలా జరగడం లేదు . ఇచ్చిన మాటను తప్పారు. మ్యానువల్‌ కౌన్సెలింగ్‌ను తుంగలో తొక్కి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపడుతున్నారు. ఇదిసరైన పద్ధతి కాదు. – రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

యూటీఎఫ్‌

దౌర్జన్యంగా బదిలీలు

అసంబద్ధంగా జరుగుతున్న బదిలీల ప్రక్రియ పై భవిష్యత్తు ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం. వీటిపై ఫిర్యాదు చేయడానికి గ్రీవె న్స్‌ ఏర్పాటు చేయలేదు. సీనియార్టీ ప్రకారం వివరాలు అందుబాటులో లేవు. దౌర్జన్యంగా బదిలీల ప్రక్రియ చేస్తున్నారు.

– కన్నన్‌,జిల్లా అధ్యక్షుడు పీఆర్టీయూ

పరిష్కార మార్గం చూపాలి

గతంలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ సజావుగా సాగింది. అప్పుడు మా సమస్యలను విని వాటిని పరిష్కరించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అంతా అసంపూర్తిగా ఉంది. ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. ఇకనైన వీటికి పరిష్కార మార్గం చూపాల్సి ఉంది. లేకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదు.

– బాలాజీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఆపస్‌

విద్యాశాఖ మంత్రి స్పందించాలి

విద్యాశాఖమంత్రి నారా లోకేష్‌ మా సమస్యల పై స్పందించాలి. ఉమ్మడి జి ల్లాలో 3,253 మంది బదిలీ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిమాండ్ల పరిష్కా రం కోసం అయ్యోర్లు రోడ్డు ఎక్కారు. అయిన ఇంత వరకు ఒక ప్రకటన లేదు. జిల్లావాసి చంద్రబాబుకు మా సమస్యలు పట్టడం లేదు.

– మదన్‌ మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్టీయూ

సీనియర్లు నష్టపోతున్నారు

సీనియర్లు జూనియర్లుగా, జూనియర్లు సీనియర్లుగా బదిలీ ప్రక్రియ విధానం జరుగుతోంది. సీనియార్టీకి విలువ లేకుండా పోతోంది. గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఉపాధ్యాయులు అయోమయంగా ఉన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. – దీనవతి,

రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, యూటీఎఫ్‌

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ1
1/7

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ2
2/7

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ3
3/7

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ4
4/7

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ5
5/7

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ6
6/7

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ7
7/7

● ఉద్యమించిన ఉపాధ్యాయులు ● వెబ్‌ ఆప్షన్‌ విధానం రద్దు చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement