యువకుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువకుడి అదృశ్యం

Jun 9 2025 6:57 AM | Updated on Jun 9 2025 6:57 AM

యువకు

యువకుడి అదృశ్యం

చౌడేపల్లె : తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన యువకుడు విశ్వతేజ(17) ఆచూకీ తెలియజేయాలని తల్లిదండ్రులు అమరావతి, అమర్నాద్‌ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. చౌడేపల్లె బజారువీధిలో నివాసం ఉంటున్న వీరు తమ కుమారుడు విశ్వతేజను శనివారం మధ్యాహ్నం మందలించారు. అప్పటి నుంచి కనపడకపోవడంతో వెతికినా ఫలితం లేకపోయిందని, ఆచూకీ తెలిసినవారు చౌడేపల్లె పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు.

ఈతకు వెళ్లి

యువకుడి మృతి

బంగారుపాళెం : మండలంలోని తగ్గువారిపల్లెలో ఆదివారం బావిలో మునిగి కర్ణాటకకు చెందిన యువకుడు మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కోలారు జిల్లా ముళబాగిల్‌ తాలూకా చాపరహళ్లికి చెందిన వెంకటరమణ కుమారుడు మురళి(23) బంగారుపాళెం మామిడి మార్కెట్‌లో ఓ మండిలో పనులు చేసేందుకు వచ్చాడు. ఆదివారం పనులు లేక పోవడంతో తగ్గువారిపల్లె సమీపంలో ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు స్నేహితులు అమర్‌, అజయ్‌, విశ్వనాఽథ్‌, విజయ్‌, రాజశేఖర్‌, గణేష్‌, తేజతో కలసివెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మురళి నీటిలోపలికి వెళ్లడంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. స్నేహితులు మురళిని బయటకు తీసే సరికి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారు పాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

యువకుడి అదృశ్యం 
1
1/1

యువకుడి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement