
సర్వేలు ఇలా..
జిల్లా కేంద్రంలో ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్న సచివాలయ సిబ్బంది(ఫైల్)
కూటమి ప్రభుత్వం గత ఏడాదిగా సర్వేలతో సరిపెట్టేస్తోంది. సవాలక్ష ప్రశ్నలతో ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. ఇదేమని అడిగితే సంక్షేమ పథకాలకంటూ అధికారులు బుకాయించడం రివాజుగా మారుతోంది. సేకరించిన వ్యక్తి సమాచారాన్ని ఏం చేస్తున్నారో.. ఎక్కడ భద్రపరుస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు చేయగా.. నేటి కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకాన్నీ సక్రమంగా అమలు చేయక సర్వేలతో కాలయాపన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వేలు.. వాటి వివరాలపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్.
హౌస్హోల్డ్ సర్వే, మనమిత్ర క్యాంపెయిన్, నాన్ రెసిడెంట్, అదర్ డిపార్ట్మెంట్ ఈకేవైసీ సొసైటీ బ్యాంక్ ఓటర్ల పేరుతో సర్వే చేపట్టారు. ఇవే కాకుండా పలు రకాల సర్వేలు చేపట్టి ప్రజలను భయాందోళలను గురిచేశారు.
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా సర్వేలకు ప్రాధాన్యమిచ్చింది. ఈ సర్వేల వల్ల ప్రజలకేమైనా లాభం చేకూర్చారా..? అంటే అదీ లేకుండా పోయింది. సచివాలయ ఉద్యోగులను పలుమార్లు ఇంటింటికీ తిప్పి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. ఇది ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తే సంక్షేమ పథకాల అమలు కోసమని మాయమాటలు చెప్పించారు. జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, కుప్పం, పుంగనూరు, పలమనేరు, నగరి, పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో సచివాలయ సిబ్బంది నెలల తరబడి ఇంటింటికీ తిరిగి ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించారు.
దానికి గోప్యత ఉందా?
వివిధ రకాల సర్వేల పేరుతో కూటమి ప్రభుత్వం సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలకు గోప్యత లేని దుస్థితి. 2019కు ముందు అప్పట్లో వివిధ సర్వేలు చేపట్టి ప్రజల సంక్షేమ పథకాలకు అప్పటి టీడీపీ లింక్ పెట్టిన విషయం విధితమే. ఇదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు వివిధ సర్వేలు చేపట్టిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కూటమి చేపట్టిన సర్వేల్లో సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకే వాడుతున్నారా? ఇంకేమైనా కుట్రలు చేస్తున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఐదేళ్లలో ఎలాంటి సర్వేలు లేకుండానే..
గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి సర్వేలు నిర్వహించకుండానే సంక్షేమ పథకాలను అమలు చేసింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా పరిపాలనను అందించింది. అర్హులైన అన్ని కులాల ప్రజలకు ఎలాంటి తారతమ్యం లేకుండా సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకే చేర్చింది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నవరత్నాల హామీల మేనిఫెస్టో ప్రకారం అమలు చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం గత ఏడాదిగా సర్వేల పేరుతో చేస్తున్న కుట్రలపై ప్రజలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
అమ్మో..పీ–4
కూటమి ఏడాది పాలనలో సర్వేల మీద సర్వేలు
ఎందుకని అడిగితే సంక్షేమ పథకాల కోసమంటూ సమాధానం
సర్వేలు చేశారే తప్ప పథకాలు అమలు చేయని వైనం
సేకరించిన వ్యక్తిగత సమాచారానికి గోప్యత ఉందా?
ఒరిగిందేమీ లేదు
సచివాలయాలను నిర్వీర్యం చేయడానికి కూటమి ప్రభుత్వం ఒడిగట్టింది. సచివాలయ సిబ్బందితో చేపట్టిన సర్వేల వల్ల ఒరిగిందేమీ లేదు. వారిని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సర్వేల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రజలకు సంబంధిన సమాచారాన్ని సేకరించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులొస్తాయో ఎవరికీ తెలియడం లేదు. ఎప్పుడూ లేని విధంగా 17 సార్లు సర్వే చేశారు. దీనిపై పలు అనుమానాలు ఉన్నాయి.
– పద్మనాభశెట్టి, సురేంద్రనగరం, కార్వేటినగరం మండలం
కూటమి ప్రభుత్వం పీ4 పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. సంక్షేమ పథకాల ఎత్తివేతకే ఈ సర్వే చేస్తున్నారన్న అనుమానం బలపడింది. ఇప్పటికే ఎన్నికల ముందు హామీలిచ్చి వంచనకు గురిచేసింది. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలో పబ్లిక్–ప్రయివేట్–పీపుల్ పార్టిసిపేషన్న్ (పీపీపీ) పేరిట సర్వే చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించి ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, దాతల సహకారంతో గుర్తించిన నిరుపేదల జీవన పరిస్థితులు మెరుగుపరచడమే సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సర్వేపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సేకరిస్తున్న వివరాల్లో ఎక్కువ భాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది.

సర్వేలు ఇలా..

సర్వేలు ఇలా..

సర్వేలు ఇలా..

సర్వేలు ఇలా..

సర్వేలు ఇలా..