
ఉపాధికి‘షార్’్ట కట్
పాలిటెక్నిక్ కోర్సులు ఉపాధికి దోహదపడు తున్నాయి. ఈ కోర్సు చేసిన బాలిక లకు షార్లో అవకాశాలొస్తున్నాయి.
శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
చిత్తూరు కలెక్టరేట్ : పేదింటి పిల్లలు ప్రపంచంతో పో టీపడేలా, తరతరాల తలరాతలను మార్చాలని గత ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యాశాఖలో సంస్కరణ విప్లవం తెచ్చింది. ఒక చదువుతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా గత ఐదేళ్ల పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇంటర్ విద్యార్థులకు అమ్మఒడి, విద్యాకానుక, నా డు నేడు తదితర పథకాలను అమలు చేసి పేద విద్యార్థు ల ఉన్నత చదువులకు భరోసా కల్పించింది.
నాటి సంస్కరణలే..నేటి ఉత్తమ ఫలితాలు
వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో అమలు చేసిన సంస్కరణలే నేడు ఇంటర్మీడియట్ ఉత్తమ ఫలితాలకు దో హదం చేశాయి. జిల్లా వ్యాప్తంగా 32 మండలాల్లో 74 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ కళాశాల ల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు పలు కార్యక్రమాలు గ త ఐదేళ్లల్లో చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి ఉండేది. గత సర్కారులో కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్లు నెరవేర్చి, వారి జీతా లు సైతం పెంచారు. దీంతో ఆ లెక్చరర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేశారు. పాఠశా ల స్థాయి విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అమ్మఒడి పథకం అమలు చేసి ఆర్థిక సహా యం అందజేశారు. ఆ ఆర్థిక సహాయంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పలు చేయాల్సిన అవసరం లేకుండా తమ పిల్లలను సజావుగా చదివించుకున్నారు.
సన్షైన్ అవార్డులు స్వీకరించిన
ఆరుగురు విద్యార్థులు
గత సర్కారులో ఉత్తమ విద్యాబోధన, విద్యాసంస్కరణతో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలోని పలమనేరు టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న హర్షిత వొకేషనల్ గ్రూపులో 971 మార్కులు సాధించింది. కుప్పం ప్రభుత్వ ఒకేషనల్ కళాశాలలో చదివిన సుస్మిత 976 మార్కులు, అదే కళాశాలలో శ్రీనివాసులు 952 మా ర్కులు, రొంపిచెర్ల కేజీబీవీలో సీఈసీ చదివిన శ్రవంతి 935, కుప్పం నడిమూరు మోడల్ స్కూల్లో సీఈసీ చదివిన అశ్విని 969 మార్కులు సాధించారు. ఈ ఐదుగురు విద్యార్థులు ఈ నెల 15వ తేదీన విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశా ఖ మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అవార్డులు, ల్యాప్టాప్ స్వీకరించారు.
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం
వారిది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం తండ్రి ట్రాక్టర్ డ్రైవర్.. తల్లి దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తూ తమ ముగ్గురి పిల్లలను పలమనేరులోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్లో పెట్టి చదివించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన వారు కష్టపడి చదువుతూ తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో పెద్దకుమార్తె తోటి హర్షిత స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో లైవ్స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డెయిరీ టెక్నాలజీ కోర్సులో వెయ్యికి 971 మార్కులను సాధించి స్టేట్ టాపర్గా నిలిచింది. ప్ర భుత్వం ఇంటర్ ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో టాపర్లుగా నిలిచిన 54 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా షైనింగ్స్టార్ అవార్డుకు హర్షిత ఎంపికై విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు స్వీకరించింది.
– 10లో
న్యూస్రీల్
గత ప్రభుత్వ సంస్కరణలతోనే నేడు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు
సత్తా చాటిన సర్కారు విద్యార్థులు
వైఎస్సార్సీపీ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత
సన్షైన్ అవార్డులు స్వీకరించిన జిల్లా విద్యార్థులు
విద్యతోనే పేదరికం దూరం..అభివృద్ధి సాధ్యం అని నమ్మింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు వేసింది. విద్యకు పెద్ద పీట వేసింది. విద్యాశాఖలో పెను మార్పులు చేసింది. సంస్కరణలు తీసుకొచ్చింది. పలు పథకాలు అమలు పరిచింది. పేద విద్యార్థులకు నాణ్యతతోకూడిన మెరుగైన విద్య అందింది. వారంతా క్రమశిక్షణతో చదివి, నేడు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, మెరిశారు. ఇందంతా నాటి వైఎస్సార్ సీపీ సర్కారు సంస్కరణల ఫలితంగా సాధ్యమైందని, వారి ఆలోచన, ఆచరణ అ‘ద్వితీయ’ం అని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధికి‘షార్’్ట కట్

ఉపాధికి‘షార్’్ట కట్