భక్తులతో కిక్కిరిసిన బోయకొండ | - | Sakshi
Sakshi News home page

భక్తులతో కిక్కిరిసిన బోయకొండ

Dec 11 2023 9:40 AM | Updated on Dec 11 2023 9:40 AM

ప్రత్యేక అలంకారంలో అమ్మవారు  - Sakshi

ప్రత్యేక అలంకారంలో అమ్మవారు

చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో క్యూలన్నీ నిండి కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఆలయ ఈఓ చంద్రమౌళి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement