
ట్యాంకర్ బోల్తా
చంద్రగిరి: ప్రమాదవశాత్తు కెమికల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన సోమవారం భాకరాపేట కనుమలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. హిందూపురం నుంచి రేణిగుంటకు కెమికల్తో ట్యాంకర్ బయల్దేరగా.. భాకరాపేట కనుమలోని దెయ్యాలకోన వద్ద అదుపుతప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా, వెలుగోడుకు చెందిన డ్రైవరు జనార్దన్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. చంద్రగిరి ఎస్ఐ వంశీధర్, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
