తొలిపోరు నేడే | - | Sakshi
Sakshi News home page

తొలిపోరు నేడే

Dec 11 2025 8:12 AM | Updated on Dec 11 2025 8:12 AM

తొలిప

తొలిపోరు నేడే

నేడు పోలింగ్‌ జరిగే జీపీలు, వార్డుల వివరాలిలా.. ఏర్పాట్లు పూర్తి చేశాం

145 జీపీలు, 1,097 వార్డులకు పోలింగ్‌ 8 మండలాల్లో 2,70,573 మంది ఓటర్లు

మండలం జీపీలు వార్డులు

అశ్వాపురం 23 193

భద్రాచలం 01 20

బూర్గంపాడు 13 125

చర్ల 26 152

దుమ్ముగూడెం 32 192

కరకగూడెం 16 118

మణుగూరు 14 123

పినపాక 20 174

చుంచుపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి దశలో 8 మండలాల పరిధిలో ఏకగ్రీవాలు మినహా 145 పంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. 3,028 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2,70,573 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే 4,003 మంది అధికారులు, సిబ్బంది బుధవారమే సామగ్రితో సహా తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకున్నారు. ఇందులో 1,812 మంది పీఓలు, 2,191 మంది ఓపీఓలు ఉన్నారు. వీరితో పాటు అదనంగా మరో 10 శాతం మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. ఎనిమిది మండలాల పరిధిలో 56 మంది రిటర్నింగ్‌ అధికారులు, 191 మంది స్టేజ్‌–2 అధికారులు, 79 మంది రూట్‌ ఆఫీసర్లు, 26 మంది జోనల్‌ అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు ఉంటేనే ఎవరినైనా పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్‌ ముగియనుండగా, 2 గంటలకు లెక్కింపు ప్రారంభించి అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. మొదట వార్డుల వారీగా ఓట్లను లెక్కించి, ఆ తర్వాత సర్పంచ్‌ ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.

14 జీపీలు ఏకగ్రీవం..

తొలివిడతలో అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల పరిధిలోని 159 పంచాయతీలు, 1,436 వార్డులకు గాను 14 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 పంచాయతీల్లో నేడు పోలింగ్‌ కొనసాగనుండగా, 461 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,436 వార్డులకు మూడు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 336 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,097 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 2,567 మంది పోటీ పడుతున్నారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 2,70,573 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలు 1,21,037, పురుషులు 1,49,525 మంది కాగా ఇతరులు 11 మంది ఉన్నారు. తొలి విడతలో 1,428 పోలింగ్‌ కేంద్రాలకు గాను 1,510 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపునకు దాదాపు 70 బస్సులు, 15 మినీ బస్సులతో పాటు ఇతర టాటా మ్యాజిక్‌ వాహనాలను వినియోగిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లాలో తొలివిడత 145 గ్రామపంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది బుధవారమే డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి సామగ్రితో సహా తరలివెళ్లారు. పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. – జితేష్‌ వి.పాటిల్‌, కలెక్టర్‌

మొదటి విడత ఎన్నికలకు రంగం సిద్ధం

తొలిపోరు నేడే1
1/3

తొలిపోరు నేడే

తొలిపోరు నేడే2
2/3

తొలిపోరు నేడే

తొలిపోరు నేడే3
3/3

తొలిపోరు నేడే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement