పాల్వంచరూరల్: మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో ఉన్న పెట్రోల్ బంక్లో బుధవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీచేశారు.దంతెలబోరుగ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడురూ.150తో ఎక్స్ట్రామైలేజ్ పెట్రోల్ను తన ద్విచక్రవాహనంలో కొట్టించుకుని కిలోమీటర్ దూరం వెళ్లగానే బైక్ ఆగిపోయింది. మెకానిక్ షెడ్కు తరలించి చూపగా, పెట్రోల్లో నీళ్లు కలిసినట్లు తేలింది. దీంతో బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయగా, తూనికలు, కొలతల శాఖ అధికారి మనోహర్ వచ్చి పెట్రోల్ బంక్లో తనిఖీ చేసి వెళ్లారు.