
మేమిక ఉండలేం..
● బదిలీల కోసం ఎకై ్సజ్ ఉద్యోగుల ఎదురుచూపులు ● ఆరేళ్లుగా 180 మందికి స్థానచలనం లేదు.. ● దూర ప్రాంతాల ఉద్యోగుల్లో ఆవేదన
ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకై ్సజ్ శాఖలో ఆరేళ్లుగా బదిలీలు జరగకపోవటంతో సిబ్బంది ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో అయిపోతుంది, వచ్చే నెలలో అయిపోతుంది అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప బదిలీల గురించి పట్టించుకోనే పరిస్థితి లేదు.
సీఐ మొదలు కానిస్టేబుళ్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1, ఖమ్మం ఎకై ్సజ్స్టేషన్–2, నేలకొండపల్లి, వైరా, మధిర, సత్తుపల్లి, సింగరేణి మొత్తం 7 ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగూడెం, అశ్వారావుపేట, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు కలిపి 6 స్టేషన్లు ఉన్నాయి. దీనికితోడు రెండు డీటీఎఫ్ (డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్)లు, ఒక ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న 180 మంది సిబ్బంది ఆరేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు ఉండగా 37 మంది హెడ్కానిస్టేబుళ్లు 140 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఖమ్మం ఎకై ్సజ్స్టేషన్–2 ఒకప్పుడు బూర్గంపాడు ఎకై ్సజ్ స్టేషన్ కాగా ముంపు మండలాలు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో కలపటంతో ఆ స్టేషన్ను అక్కడి నుంచి ఖమ్మం తరలించి ఎకై ్సజ్స్టేషన్–2గా మార్చారు. అయితే దాదాపు పదేళ్లు కావొస్తున్నా ఈ స్టేషన్లో 8 మందికి పైగా సిబ్బంది అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తుండటం గమనార్హం. ఏళ్ల తరబడి అవే స్టేషన్లలో పనిచేస్తుండటంతో సిబ్బందిపై సైతం పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు ఎంతోకాలంగా ఏజెన్సీ ప్రాంతాలు, దూరప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఈ స్టేషన్లలో ఎంతకాలం పనిచేయాలనే ధోరణితో నిరాశ చెందుతున్నారు.
త్వరలోనే పక్రియ..?
గతంలో మాదిరిగా ఈసారి బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం లేదని దాదాపు బదిలీలు జరగటం ఖాయమని కొందరు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ చివరి వారం లేదా, మే మొదటివారంలో బదిలీలు జరిగే అవకాశం ఉందని ఎకై ్సజ్ రాష్ట్ర ఉన్నతాధికారి విదేశాల్లో ఉండటంతో ఆయన తిరిగి రాగానే వెంటనే రాష్ట్రవ్యాప్తంగా బదిలీల ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు, వచ్చేనెల వరకు బదిలీ పక్రియ జరిగితే తమ పిల్లల విద్యాభ్యాసానికి ఇబ్బంది ఉండదని ఆలస్యం అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని సిబ్బంది చెబుతున్నారు.