రఘురాముడు గెలిస్తే అభివృద్ధి: హీరో వెంకటేష్‌ | - | Sakshi
Sakshi News home page

రఘురాముడు గెలిస్తే అభివృద్ధి: హీరో వెంకటేష్‌

May 8 2024 3:25 AM | Updated on May 8 2024 9:16 AM

రఘురాముడు గెలిస్తే అభివృద్ధి..

రఘురాముడు గెలిస్తే అభివృద్ధి..

కొత్తగూడెంరూరల్‌ : ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మెళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన కూతురును రఘురాంరెడ్డి ఇంటికే కోడలిగా పంపించానని, వారిది ప్రేమానురాగాలు గల కుటుంబమని చెప్పారు. ఆయన గెలిస్తే ఉమ్మడి జిల్లా ప్రజలను కూడా ప్రేమగా చూసుకుంటారని అన్నారు. 

ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటేసి రఘురాంరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ ప్రధాని అవుతారని, రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అభ్యర్థి రఘురాంరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, కాంగ్రెస్‌ నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ల మురళి, తూము చౌదరి, నాగేంద్రత్రివేది, నాగా సీతారాములు, బోయిన సురేష్‌, శంకర్‌ నాయక్‌, ఎండీ రజాక్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement