కానిస్టేబుల్‌ కుటుంబానికి పరిహారం అందజేత | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ కుటుంబానికి పరిహారం అందజేత

Mar 28 2023 11:56 PM | Updated on Mar 28 2023 11:56 PM

కొత్తగూడెంరూరల్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి 6వ బెటాలియన్‌ కమాండెంట్‌ డి.శివ ప్రసాద్‌రెడ్డి మంగళవారం రూ.30 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. 6వ బెటాలియన్‌కు చెందిన పోలీసుకానిస్టేబుల్‌ మంచినీళ్ల రమేష్‌ టేకులపల్లిలో విధులకు వెళ్తూ గతేడాది డిసెంబర్‌ 18న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులకు చెక్కు అందించారు. ఎస్‌బీఐ మేనేజర్‌ మురళీకృష్ణ, అసిస్టెంట్‌ కమాండెంట్‌ బి.సీతారాం, టి.కాళీదాస్‌,ఆర్‌ఐ,ఆర్‌ఎస్‌ఐలతోపాటు బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement