ఏపీలో చోరీ.. తెలంగాణలో తాకట్టు! | - | Sakshi
Sakshi News home page

ఏపీలో చోరీ.. తెలంగాణలో తాకట్టు!

Mar 28 2023 11:56 PM | Updated on Mar 28 2023 11:56 PM

అశ్వారావుపేటరూరల్‌: ఏపీలో చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఓ దొంగ తెలంగాణలోని అశ్వారావుపేటలో తాకట్టు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నాగారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి బంగారం ఆభరణాల చోరీకి పాల్పడ్డాడు. అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం వెల్లడైనట్లు తెలిసింది. అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో ఓ స్థానికుడి ఆధార్‌ కార్డు ప్రూఫ్‌తో తాకట్టు పెట్టి, దాదాపు రూ.8.50 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఏపీ పోలీసులు మంగళవారం అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వెళ్లారు. దీనిపై స్థానిక ఎస్‌ఐ బి.రాజేశ్‌ కుమార్‌ను వివరణ కోరగా.. ఏపీ పోలీసులు విచారణ వాస్తవమేనని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement