మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలి

Mar 28 2023 11:56 PM | Updated on Mar 28 2023 11:56 PM

ప్లాంటేషన్‌ను పరిశీలిస్తున్న జెడ్పీ సీఈఓ విద్యాలత - Sakshi

ప్లాంటేషన్‌ను పరిశీలిస్తున్న జెడ్పీ సీఈఓ విద్యాలత

ఇల్లెందురూరల్‌: ఎండలు మండుతున్నందున మొక్కలు వడలిపోకుండా సంరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జెడ్పీ సీఈఓ విద్యాలత పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండలంలోని బొజ్జాయిగూడెం, ఇందిరానగర్‌ గ్రామపంచాయతీల్లో మంగళవారం అవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీ, క్రీడా ప్రాంగణాలను తనిఖీ చేసి మాట్లాడారు. రహదారుల వెంట ఉన్న మొక్కలకు విధిగా ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా నీటిని అందించాలని సూచించారు. ఎండ ప్రభావం పడకుండా నర్సరీలపై షేడ్‌నెట్‌లను విధిగా అమర్చాలని చెప్పారు. ఎంపీడీఓ అప్పారావు, షర్మిల, నాగమణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement