
ముగిసిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్
క్రోసూరు: క్రోసూరులోని జెడ్పీపాఠశాల ఆవరణలో గత నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. మొత్తం 40 జట్లు పాల్గొన్న టోర్నమెంట్లో వైఎంసీఏ, క్రోసూరు జట్టు విజేతగా నిలిచి, ట్రోఫీతోపాటు ప్రథమ బహుమతి కింద రూ.50,116లు అందుకుంది. అదేవిధంగా రన్నర్స్గా సాయిసీసీ, క్రోసూరు జట్టు నిలిచింది. ఆ జట్టుకు రూ.25,116లు అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన పిడుగురాళ్ల జట్టుకు రూ.10,116లు అందజేశారు. బెస్ట్ బ్యాట్స్మెన్ పిడుగురాళ్లకు చెందిన ప్రకాష్కు రూ.2,116, బెస్ట్ బౌలర్ క్రోసూరుకు చెందిన కోటి రూ 2,116లు నిర్వాహకులు అందజేశారు. పలువురు సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానుల, మాజీ యార్డు చైర్మన్ యేపూరి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.