
15 లోపు దరఖాస్తు చేసుకోవాలి
రెంటచింతల: స్థానిక ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో వివిధ తరగతులలో ఇంగ్లీష్ మీడియంలో 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశం కోరు బాలురు ఈ నెల 15వ తేదీలోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సింహాద్రి మోహన్ కోరారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రిన్సిపాల్ మోహన్ మాట్లాడుతూ ఖాళీలను తరగతుల వారీగా రోస్టర్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఎస్టీలకు 78 శాతం, ఎస్సీలకు 12 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 2 శాతం, పీహెచ్సీలకు 3 శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. 5 వ తరగతిలో 40 ఖాళీలు, 6వ తరగతిలో 10 ఖాళీలు, 9వ తరగతి లో 9 ఖాళీలు ఉన్నాయన్నారు. బ్లాక్లాగ్ సీట్లకు ఎస్టీలు మాత్రమే అర్హులన్నారు. ప్రవేశ పరీక్ష జూన్ 16వ తేదీన పాఠశాలలో తరగతుల వారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుతో పాటు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ నకలు, రెండు పాస్పోర్టు ఫొటోలు, తల్లిదండ్రుల రేషన్కార్డును జత చేసి పాఠశాలలో అందజేయాలన్నారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా విద్య బోధించడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 8333925177 నంబర్లో సంప్రదించాలని కోరారు.