
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
చీరాల రూరల్: రైలు ఢీకొన్న సంఘటనలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చీరాల–స్టుపర్టుపురం రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. విజయవాడవైపు వెళ్లే డౌన్లౌన్లో వృద్ధుడు మృతి చెందాడనే సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. మృతుడి వయస్సు 55 నుంచి 60 ఏళ్లు ఉంటాయని, రైలు ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని.. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుని గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే 9440627646 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.