మూల విరాట్‌ను తాకిన సూర్యకిరణాలు | - | Sakshi
Sakshi News home page

మూల విరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

Apr 9 2025 2:09 AM | Updated on Apr 9 2025 2:09 AM

మూల వ

మూల విరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

జంపని(వేమూరు): ఏకాదశి పర్వదినం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్‌ చెన్నకేశవున్ని సూర్య కిరణాలు తాకాయని దేవస్థానం అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి తెలిపారు. మండలంలోని జంపని గ్రామంలో చెన్న కేశవాలయంలో మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్‌ స్వరూపం చెన్నకేశవున్ని సూర్యకిరణాలు తాకాయి పాదాల నుంచి కిరీటం వరకు స్వామి వారి ప్రతి అంగాన్ని తాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్య భగవాసుడు కేశవున్ని స్పృశించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు తెలిపారు.

లక్ష్మీనరసింహస్వామిని

దర్శించుకున్న శృంగేరి ప్రతినిధులు

అద్దంకి రూరల్‌: పుణ్యక్షేత్రమైన శింగరకొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం శృంగేరి ప్రతినిధులు సందర్శించారు. మేనెల 19వ తేదీన నిర్వహించనున్న మహా కుంభాభిషేకం సందర్భంగా పీఠాధిపతులు విచ్చేయుచున్నందున ముందుగా వారి ప్రతినిధులు లక్ష్మీ నరసింహాస్వామిని సందర్శించారు. వారిని కార్యనిర్వహణాధికారి, అర్చకులు ఆలయ సంప్రదాయాలు ప్రకారం ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెంటేల శరత్‌కు యువ ఔత్సాహిక రైతు పురస్కారం

మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం బబ్బెపల్లి గ్రామానికి చెందిన పెంటేల శరత్‌బాబు యంగ్‌ ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌ పురస్కారం అందుకున్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన రైతు సదస్సులో శరత్‌ ఈ పురస్కారం అందుకున్నారు. ప్రతిష్టాత్మక నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఆన్‌ కమర్షియల్‌ అగ్రికల్చర్‌ ( నిర్కా)సంస్థ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి శాసీ్త్రయ సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ నూతన పోకడలను అవలంభిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న 17 మంది యువ ఔ త్సాహిక రైతులను ఎంపిక చేశారు. వారిలో పెంటేల శరత్‌ ఒకరు. ఫార్మర్స్‌ సొసైటీని స్థాపించి ఉమ్మడి వ్యవసాయ విధానంతో రైతు సంక్షేమం సాధ్యమే అంటున్న శరత్‌ను యంగ్‌ ఎంటర్ర్‌పైడర్గా గుర్తించి నిర్కా సంస్థ చైర్మన్‌ శేషు మాధవ్‌ షీల్డును, ప్రశంసాపత్రాన్ని అందించి శరత్ను సత్కరించి సన్మానించారు.

కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.వెంకట్‌, రాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. మంగళవారం ఉదయం వారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్‌కు చిన్నారులు లావణ్య, ప్రవీణ్‌ చౌదరి పేరున విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్‌ బొప్పన సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పెదగార్లపాడులో వైభవంగా రథోత్సవం

దాచేపల్లి : పెదగార్లపాడులో రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పండుగ ముగిసిన తరువాత మూడవ రోజున గ్రామంలో రథోత్సవం జరుపుతారు. రామాలయంలో ఉన్న రథాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించి, అర్చకులు పూజలు చేసిన అనంతరం రథోత్సవ కార్యక్రమం చేపట్టారు.

మూల విరాట్‌ను తాకిన సూర్యకిరణాలు 
1
1/1

మూల విరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement