ఆందోళనకు దిగిన ఆరోగ్యమిత్రలు
బాపట్లటౌన్: ఏళ్ల తరబడి డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్నా...మా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బడుగు రాజు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. రాజు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నా మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. అనేక పర్యాయాలు దరఖాస్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో శాంతియుత నిరసన తెలియజేస్తున్నామన్నారు. వైద్యసేవ పథకంలో పనిచేసే ప్రతి ఒక్కరిని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం అమలుచేయాలి, వైద్యసేవ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియో, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు అందించాలి. అర్హత ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆరోగ్య మిత్రల నిరసన
గుంటూరు మెడికల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరతూ సోమవారం విధులు బహిష్కరించారు. గుంటూరులోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమారి, జిల్లా అధ్యక్షుడు జాకీర్హుస్సేన్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
పసుపు రైతులకు పరిహారం
చెల్లించాలని వినతి
తెనాలి: దుగ్గిరాలలోని శుభమ్ మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాదంలో దగ్ధమైన పసుపునకు ప్రభుత్వం ఇచ్చిన హామీప్రకారం పరిహారాన్ని త్వరితగతిన చెల్లించాలని బాధిత రైతులు తెనాలి సబ్కలెక్టర్ వి.సంజనా సింహకు విజ్ఞప్తి చేశారు. సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. 296 మందికి రూ.15 కోట్ల బీమా క్లెయిమ్ అయినట్టు సబ్కలెక్టర్ వెల్లడించారు. పరిహారం అందకపోవటంతో రైతులు ఆర్థిక సమస్యలతో అవస్థలు పడుతున్నారని చెప్పారు.
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి