ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి

Dec 11 2025 8:10 AM | Updated on Dec 11 2025 8:10 AM

ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి

ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి

ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి

రామాపురం: ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ తెలిపారు. మండలంలోని నీలకంఠరావుపేట గ్రామం రైతుసేవా కేంద్రంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనర్‌ మధుకర్‌ మాట్లాడుతూ నీలకంఠరావుపేట గ్రామాన్ని నేషనల్‌ మిషన్‌ ఫర్‌ నాచురల్‌ ఫామింగ్‌ కింద కొత్తగా తీసుకోవడం జరిగిందని, ఇక్కడ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వై.నాగమణి, సాంకేతిక వ్యవసాయ అధికారి నవంత్‌బాబు, పట్టుపరిశ్రమశాఖ సాంకేతిక అధికారి లక్ష్మి, శశికళ, రైతు సేవా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement