
సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి
రాయచోటి: సైబర్ మోసగాళ్ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి వలలో పడరాదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఏపీకే ఫైల్స్, జీమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. లాటరీ తగిలిందని, బహుమతులు వచ్చాయని చెప్పే మోసపూరిత సందేశాలను నమ్మవద్దని కోరారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సురక్షితమైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని ఎస్పీ నొక్కి చెప్పారు. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దన్నారు. తెలియని యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సైబర్ మోసాలను నివారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు