నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Jun 23 2025 6:04 AM | Updated on Jun 23 2025 6:04 AM

నేడు

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈ నెల 23వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గంగమ్మకు బోనాల సమర్పణ

లక్కిరెడ్డిపల్లి: కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా లక్కిరెడ్డి పల్లె మండల పరిధిలోని అనంతపురంలో గంగమ్మ ఆలయం విరాజిల్లుతోంది. ఆదివారం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగమ్మా ..కరుణ చూపు తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు.కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో వర్షాలు కురిపించి పంటలు బాగా పండేలా దీవించమ్మా అంటూ రైతులు వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.

27 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ

అఖిల భారత మహాసభలు

మదనపల్లె సిటీ: కేరళలోని కొజికోడ్‌లో జూన్‌ 27 నుంచి 30 వరకు ఎస్‌ఎఫ్‌ఐ 18వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి అన్నారు. ఆదివారం మహాసభలకు సంబంధించిన పోస్టర్స్‌ను స్థానికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 50లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థిసంఘంగా ఎస్‌ఎఫ్‌ఐ ఉందన్నారు. అందరికీ విద్య, ఉపాధి, శాసీ్త్రయ విద్యావిధానం కోసం ఉద్యమిస్తోందన్నారు. నూతన జాతీయ విద్యావిధానంతో ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కాషాయీకరణ చేస్తూ నీరుగార్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. పేద, బడగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం కష్టతరంగా ఉందన్నారు. కొఠారి కమిషన్‌ పేర్కొన్న విధంగా జీడీపీ 6శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు అఫ్రిద్‌, జిల్లా కమిటీ సభ్యుడు జయబాబు, సమీర్‌, నాయకులు శ్రీధర్‌నాయక్‌, తరుణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌, కార్తీక్‌, యశ్వంత్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు

155 మంది హాజరు

కడప ఎడ్యుకేషన్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం రెండవ రోజు ఆదివారం కడప లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 15001వ ర్యాంకు నుంచి 32 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌ కేంద్రానికి చేరుకుని తమకు సంబంధించి దృవపత్రాలను పరిశీలించుకున్నారు. రెండవ రోజు కౌన్సెలింగ్‌కు 155 మంది అభ్యర్థులు హాజరై తమ ధృవ పత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కౌన్సెలింగ్‌ కార్యక్రమంలో కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి, ఛీప్‌ వెరిఫికేషన్‌ ఆపీసర్‌ దామోధర్‌, వెరిఫికేషన్‌ ఆఫీసర్లు అనిత, బాగ్యశ్రీ, రేణుకా, రాజేష్‌ పాల్గొన్నారు.

నేటి కౌన్సెలింగ్‌కు...

సోమవారం నిర్వహించబోయే కౌన్సెలింగ్‌ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 32000 నుంచి 50 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు తమకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ జ్యోతి తెలిపారు.

నేడు ప్రజా సమస్యల  పరిష్కార వేదిక 1
1/2

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల  పరిష్కార వేదిక 2
2/2

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement