చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి.. కడుపుకొట్టకండి | - | Sakshi
Sakshi News home page

చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి.. కడుపుకొట్టకండి

Jun 23 2025 6:04 AM | Updated on Jun 23 2025 6:04 AM

చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి.. కడుపుకొట్టకండి

చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి.. కడుపుకొట్టకండి

రైల్వేకోడూరు అర్బన్‌: సీఎం చంద్రబాబు చేతనైతే ఉద్యోగాలు ఇవ్వాలని, తమపై కోపంతో ప్రతిపక్షనాయకులను ఎదుర్కోలేక తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ. 20 వేలు రూ. 30 వేలు సంపాదించుకునే ఉద్యోగుల కడుపుకొట్టొద్దని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పార్టీకార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ సంస్థల్లో యువకులకు తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తే తమపై కోపంతో వాటిని పీకేసి వారి కుటుంబాలు రోడ్డున పడేటట్లు చేసిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీసీఎం పవణ్‌, మంత్రి లోకేష్‌లదేనని పేర్కొన్నారు. ఏపీఎండీసీలో తీసేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు,లోకేష్‌లు 25లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఉడగొడుతూ యువకులకు ద్రోహం చేస్తున్నాని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన వేంటనే 2 లక్షల మందికి పైగా యువకులకు వివిధ రకాల ఉద్యోగావకావశాలు కల్పించారని, ప్రజలకు సంక్షేమం అందించారని గుర్తు చేశారు. ఏపీఎండీసీలో స్థానికతకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడి చదువుకొన్న యువతకు మేము ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబు రాగానే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం దారుణమని తెలిపారు.అధికారం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా చేస్తే ఉద్యోగులు, యువతలో అభద్రతా భావం ఏర్పడుతుందని తెలిపారు. రాజకీయాల్లో నాయకత్వం వహించే నాయకులు ఆదర్శంగా ఉండాలన్నారు. తమపై రాజకీయ కక్షసాధింపులో భాగంగా యువకులకు అన్యాయం చేయడం సబబు కాదన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉండి న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు తమపనులు చేసుకొంటున్నారని, ఇలా చిరుద్యోగులపై కక్ష సాధింపు సరి కాదన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్‌రమేష్‌, వెలగచర్లశివారెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, పంజం సందీప్‌రెడ్డి, తల్లెంభరత్‌కుమార్‌రెడ్డి, అన్వర్‌బాషా, హరికృష్ణ, మారెళ్లరాజేశ్వరి, బండారుమల్లి, గల్లాశ్రీనివాసలు, ఆర్వీరమణ, డమ్ము రఘు, డీవీరమణ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి,

మాజీఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement