
త్యాగానికి ప్రతీక బక్రీద్
బక్రీద్ వేడుకలను జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం రాయచోటి, మదనపల్లె, పీలేరు, రాజంపేట, కోడూరు, తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రాలతో పాటు వాల్మీకిపురం, గుర్రంకొండ, చిట్వేలి, లక్కిరెడ్డిపల్లి, బి కొత్తకోట తదితర మండల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోని ఈద్గాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు బక్రీద్ పండుగ విశిష్టతను వివరించారు. ఖురాన్ లో చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ప్రతీ ముస్లిం పాటించాలన్నారు. సోదరభావం, దానం, త్యాగం వంటి సుగుణాలను ఈ పండుగ ప్రతిబింబిస్తుందని, సమస్త మానవాళికి ఆదర్శనీయమని, ప్రజలందరూ ధనిక పేద తేడా లేకుండా పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రార్థనల అనంతరం చిన్నారులు, పెద్దలు పరస్పరం ఈద్–ముబారక్ చెప్పుకున్నారు. అనంతరం పూర్వికుల సమాధుల వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రాజంపేటలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మదనపల్లెలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నిస్సార్ అహ్మద్, ఆయా ప్రాంతాల్లోని స్థానిక నాయకులు ప్రార్థనలలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలో సామరస్య స్ఫూర్తి, దాతృత్వం వెల్లివిరిసింది.పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. –సాక్షి నెట్వర్క్

త్యాగానికి ప్రతీక బక్రీద్

త్యాగానికి ప్రతీక బక్రీద్

త్యాగానికి ప్రతీక బక్రీద్

త్యాగానికి ప్రతీక బక్రీద్

త్యాగానికి ప్రతీక బక్రీద్