
భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ చేశారు. సోమవారం రాత్రి మూల విరాట్ స్వామి వారికి, అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి అందంగా అలంకరించి భక్తుల దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ మాఢవీధులలో, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. పల్లకీల సేవలో స్థానిక భక్తులతో పాటు కర్నాటకకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
యోగా కోసం సిద్దవటం కోటలో స్థల పరిశీలన
సిద్దవటం : యోగా నిర్వహణ కోసం సిద్దవటంలోని మట్లిరాజుల కోటలో స్థలాన్ని సోమవారం కడప ఆర్డీఓ జాన్ఇర్విన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగాంధ్ర 2025 జిల్లా స్థాయి కార్యక్రమాల్లో భాగంగా సిద్దవటం లోని గార్డన్ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయం ఏఓ శంకరయ్య, స్థానిక తహసీల్దార్ తిరుమలబాబు, ఎంపీడీఓ ఫణిరాజకుమారి, ఆర్ఐ ప్రసాద్, వీఆర్ఓ కేశవులు, పురావస్తు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీరు బాటిల్తో వ్యక్తిపై దాడి
మదనపల్లె రూరల్ : పోలీసులకు తమ గురించి సమాచారం ఇచ్చాడనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిపై బీరుబాటిల్తో దాడిచేసిన ఘటన ఆదివారం రాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. మంజునాథ కాలనీలో టూ టౌన్ పోలీసులు ఆదివారం సాయంత్రం మద్యం, గంజాయి వినియోగం, విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం స్థానికుడైన మధు(42)తో మాట్లాడి వెళ్లారు. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఆనంద్, మల్లయ్య, చంద్ర తదితరులు పోలీసులకు సమాచారం అందించి ఉంటాడనే అనుమానంతో మధుతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా బీరు బాటిల్తో దాడిచేసి కొట్టారు. దాడిలో మధు తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ

భద్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ