
వెన్నుపోటు దినంలో కదం తొక్కాలి
రాజంపేట టౌన్ : గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేసి వెన్నుపోటు పొడిచినందున మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాఽథ్రెడ్డి పిలుపునిచ్చారు. రాజంపేట పట్టణం జీఎంసీ కళ్యాణ మండపంలో మంగళవారం వెన్నుపోటు దినం రాజంపేట కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే, మాట్లాడారు. జగన్ మళ్లీ సీఎం అయివుంటే వివిధ పథకాల ద్వారా ప్రతి ఇంటికి రెండు లక్షల రూపాయిలు వచ్చేదన్నారు. అయితే చంద్రబాబు సీఎం కావడంతో ప్రజలకు ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూరలేదన్నారు. పథకాలు అందక పోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని తెలిపారు. ఈకారణంగా వెన్నుపోటు దినంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. దేశంలో అధికారం చేపట్టిన ఏడాదిలోనే ప్రజాగ్రహానికి గురైన ఏకై క సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని చంద్రబాబు మహానాడు వేదికగా చెప్పారన్నారు. అయితే జిల్లాలోని తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని, టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు పాలనపై నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి వచ్చి తలపడాలని ఎమ్మెల్సీ రమేష్యాదవ్ సవాల్ విసిరారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని ఉప ఎన్నికల్లో ఉమ్మడి వైఎస్సార్జిల్లాలో ఉన్న పది సీట్లలో టీడీపీ ఒక్కసీటు గెలిచినా తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, అందుకు బాబు సిద్ధమా అని ఎమ్మెల్సీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు జెనుగు కృష్ణారావుయాదవ్, బీసీసెల్ నాయకుడు వడ్డే రమణ, మహిళా విభాగం ప్రతినిధులు రక్కాసి శ్రీవాణి, మిర్యాల సురేఖ, సుజాత, ఆరెళ్ళ రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు
ఆకేపాటి పిలుపు