
హామీ అమలు చేయాలి
అన్నమయ్య డ్యాం నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన హామీ ఏమైంది. ఏడాది పూర్తయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేటకు చంద్రబాబు వచ్చిన సందర్భంగా అన్నమయ్య జలాశయం నిర్మాణం పూర్తి చేసి, ఆయకట్టుకు నీరందిస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఆ మాటలు నీటి మూటలుగా మారిపోయాయని రాజంపేట వాసులు భావిస్తున్నారు.వెంటనే హామీ అమలు చేయాలి.
–పాపినేని విశ్వనాథరెడ్డి,
జిల్లా అధికారప్రతినిధి, వైఎస్సార్సీపీ, రాజంపేట