మదనపల్లె సిటీ: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ)లో జిల్లాకు చెందిన విద్యార్థులు చక్కని ప్రతిభ చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించి పలువురి ప్రశసంలు పొందారు.
సాప్ట్వేర్ ఇంజనీర్ కావాలి ఉంది
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని ఉందని ఏపీఈఏపీసెట్ ర్యాంకర్ ఎం.ఎ. మహమ్మద్ముదసిర్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో 105 ర్యాంకు దక్కించుకున్నారు. మదనపల్లె పట్టణం ఇందిరానగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహల్ ప్యారేజాన్, మోహతాజ్ కుమారుడు ముదసిర్ విజయవాడ చైతన్య కాలేజీలో చదివారు. చిన్నప్పటి నుంచి చదువులో రాణించేవాడు. ఇంటర్మీడియట్ ఎంపీసీలో 979 మార్కులు సాధించాడు. జెఈఈ మెయిన్స్లో 99.935 పర్సంటైల్ మార్కులు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్లో 412 ర్యాంకు సాధించాడు.
’కంప్యూటర్ ఇంజినీరింగ్ చేస్తా:
కంప్యూటర్ ఇంజినీరింగ్ చేస్తా నని దయ్యాల రిష్యంత్రెడ్డి అన్నారు. ఏపీఈఏపీసెట్–25 ప్రవేశ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 377 ర్యాంకు సాధించాడు. మదనపల్లె సరస్వతినగర్కు చెందిన పెంచుపాడు హైస్కూల్ ఉపాధ్యాయుడు ప్రతాప్రెడ్డి, సుప్రజల కుమారుడు రిషంత్రెడ్డి విజయవాడ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. ఇంటర్మీడియట్లో ఎంపిసిలో 984 మార్కులు సాధించాడు. జెఈఈ అడ్వాన్స్లో 5056 ర్యాంకు వచ్చింది.
మెరిసిన కృష్ణహర్షిత్
ఏపీ ఈఏసీ సెట్ పలితాల్లో కడప ఎన్జిఓ కాలనీకి చెందిన మంచాల కృష్ణ హర్షిత్ రాష్ట్రస్థాయిలో 37వ ర్యాంకును సాధించి మెరిశాడు. మంచాల ఈశ్వర్, రాధికల కుమారుడు కృష్ణహర్షిత్ ఇటీవల విడుదలైన ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కూడా 197వ ర్యాంకు సాధించాడు. చైన్నె ఐఐటీలో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి..సాప్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగం సాధించడమే లక్ష్య మని పేర్కొన్నాడు. కృష్ణహర్షిత్ తండ్రి మంచాల ఈశ్వర్ సిద్దవటం మండలం మాధవరం జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు.
శభాష్..వేద వర్సిత్
కురబలకోట: ఏపీ ఈఎపీసెట్ ఫలితాల్లో కురబలకోట మండలం మద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన మొరుంపల్లె సహదేవరెడ్డి కుమారుడు వేదవర్సిత్ రెడ్డి రాష్ట్రస్థాయిలో 403 ర్యాంకు సాధించాడు.సహదేవరెడ్డి కొన్నేళ్లుగా మదనపల్లెలోని నీరుగట్టివారిపల్లెలో బ్రిలియంట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. పది వరకు అక్కడే చదివాడు.ఇంటర్ తిరుపతి నారాయణ జూనియర్ కళాశాలలో చదివారు. 985 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.ఐఐటీ చదవాలన్నది తన ధ్యేయమన్నాడు.
ఏపీఈఏపీసెట్లో మెరిశారు
ఏపీఈఏపీసెట్లో మెరిశారు
ఏపీఈఏపీసెట్లో మెరిశారు