
●వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటింటికీ సంక్షేమం
సాక్షి రాయచోటి : పేదల సంక్షేమం ఒకవైపు....అభివృద్ధి మరోవైపు పరుగులు తీసిన పరిస్థితి నాటిది...ఇంటింటికి ఫలాలు అందడం...సేవలకు కేరాఫ్ సచివాలయం అన్నది ఇంతకుముందున్న ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితి. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా అండగా వలంటీర్ ఉన్నాడన్న ధైర్యం....మహిళలకు ఎన్నో పథకాలు...అలాగే రైతులకు వ్యవసాయంలో ఒక భరోసా....పేద ప్రజలకు ఆరోగ్య పరంగా నేనున్నాన్న గుండె ధైర్యాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారు. పేద విద్యార్థులను ఇంజనీర్లు, డాక్టర్లను చేయాలన్న సంకల్పం దిశగా భవిష్యత్ ఆలోచనతో అడుగులు వేశారు. అయితే ప్రస్తుత సర్కార్ పేద ప్రజలకు సంక్షేమం బదులు కష్టాలు తెచ్చిపెట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సర్కార్ అఽధికారంలోకి రావడంతో పథకాలకు పేర్లు మార్చిందే తప్పా.. సంక్షేమం దిశగా అడుగులు పడటం లేదు. ఎక్కడ చూసినా కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఇసుక, మట్టి దోపిడీతో కూటమి సర్కార్ పాలన చేస్తోంది. ఎన్నికల ముందు సూపర్సిక్స్ అంటూ ఆర్భాటంగా పథకాలు ప్రకటించి...అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి సర్కార్ వంచన, దగ, మోసం, కుట్రలపై వెన్నుపోటు దినం పేరుతో బుధవారం పెద్దఎత్తున ప్రజా ఆందోళనకు పిలుపునిచ్చింది.
ఎన్నికల సభల్లోనూ ఎన్నెన్నో..
ఎన్నికలకు ముందు రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లెల్లో చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటించారు. ఎన్నెన్నో హామీలు గుప్పించారు. రైల్వేకోడూరులో మామిడికి సంబంధించి పండ్ల రసాల పరిశ్రమ తెరిపించడం, అంతేకాకుండా మామిడికి సంబంధించి పరిశ్రమలు పెడతామన్నా దిక్కులేదు. జిల్లాలో హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్నా ఇంతవరకు అతీగతీ లేదు. రాయచోటికి సంబంధించి అనేక హామీలు గుప్పించినా కార్యరూపం దాల్చలేదు. మదనపల్లె, రాజంపేటలను జిల్లా చేస్తామని హామీ ఉన్నా ఆచరణ సాధ్యం కాలేదు. రాజంపేటలో మెడికల్ కాలేజీ తీసుకు వస్తామన్నా ఇప్పటికీ లేదు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నా వైఎస్సార్ సీపీ హయాంలో టెండర్ల వరకు వచ్చిన ప్రక్రియను కూడా నిలిపి వేశారు. మదనపల్లెలో రోడ్ల అభివృద్ధికి...ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడలేదు.
బాబు మాటలు నీటిమీద రాతలు
ప్రస్తుత సీఎం చంద్రబాబు మాటలు నీటిమీద రాతలు గా తేలిపోతున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కనిపించడం లేదు. పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది అవుతున్నా తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అన్నదాత సుఖీభవ ఇలా చెబుతూపోతే సూపర్సిక్స్ పథకాలకు ఇంకా మోక్షం లభించలేదు. బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ అని అర్థమవుతోంది. ఇంటింటికి ఉద్యోగం లేదు...నిరుద్యోగ భృతి లేదు....ఇదే కాదు...అనేక రకాలుగా చెప్పిన హామీలు ఏవీ కూడా అమలుకు నోచుకోలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా అదీ కూడా అరకొరగా అందిందే తప్ప పూర్తిస్థాయిలో సబ్సిడీ అందుకున్న పరిస్థితి లేదు.
ఇసుక, మట్టి దోపిడీ
జిల్లాలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఇసుకను పార్టీ కీలక నేతలే భాగస్వాములై సరిహద్దులు దాటిస్తున్నారు. చెయ్యేరు నదిని లూటీ చేస్తున్నా అడిగే వారే లేరు. అంతేకాకుండా రాత్రిళ్లు పెద్దపెద్ద టిప్పర్లతో ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో చాలాచోట్ల మట్టిని కూడా అలాగే అమ్మేస్తున్నారు. చెరువుల్లోనూ తవ్వకాలు చేపట్టి మట్టిని అమ్ముకుంటుండగా గుట్టలను కూడా చదును చేస్తున్నారు. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే కబ్జాలు పెరిగిపోయాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికార పార్టీ నాయకుల ఆగడాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నా అడిగే దిక్కు దివానం లేని పరిస్థితి నెలకొంది. మరోపక్క ఎక్కడికక్కడ అక్రమ కేసులు బనాయించడం, దౌర్జన్యాలు, బెదిరింపులు కూడా కొనసాగిస్తున్నారు. మదనపల్లెకు మెడికల్ కళాశాల మంజూరైనా వాటి సీట్లను కూడా ఇవ్వకుండా ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా అభివృద్ధిని కూటమి సర్కార్ విస్మరించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ముందు
అధికారం కోసం హామీల వల
అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా నెరవేర్చని కూటమి సర్కార్
రైతులు, మహిళలు, యువత,
విద్యార్థులు ఇలా అందరికీ వెన్నుపోటు
జిల్లాలో విచ్చలవిడిగా
ఇసుక, మట్టి తవ్వకాలు
దాడులు, వేధింపులతో సాగుతున్న పాలన
వలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ వాహన ఆపరేటర్ల తొలగింపు
నేడు జిల్లాలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుపై నిరసనలు
భారీ ఎత్తున నిర్వహించేలా
సన్నద్ధమైన పార్టీ శ్రేణులు
అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటింటికి సంక్షేమం అందించారు. విద్యార్థులు ,రైతులు.. ఇలా ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని పంచారు. సచివాలయాల ద్వారా 540 సేవలు, వలంటీర్ల ద్వారా ఇంటింటికి ఫలాలు అందించి వైఎస్సా ర్ సీపీ సర్కార్చరిత్రలో నిలిచిపోయింది. ఇంకా అనేక రకాల పథకాలతో మహిళలను మహారాణులుగా మార్చారు. పరిశ్రమలకు పెద్దపీట వేసి స్థాని క యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎక్కడికక్కడ పారిశ్రామిక వాడల నిర్మాణాలు చేపట్టారు. జిల్లా కేంద్రమైన రాయచోటిని విస్తృతంగా అభివృద్ధి చేశారు. మదనపల్లెలో మెడికల్ కాలేజీని అద్భుతంగా నిర్మిస్తున్నారు. అన్నిచోట్ల వంద పడకల ఆస్పత్రులు, పల్లె ముంగిట సచివాలయాల నిర్మాణాలతో వైఎస్ జగన్ సర్కార్ హయాంలో కొత్త కళ సంతరించుకుంది.

●వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటింటికీ సంక్షేమం