కేంద్రీయ విద్యాలయానికి కదలిక! | - | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయానికి కదలిక!

Jun 3 2025 5:25 AM | Updated on Jun 3 2025 5:25 AM

కేంద్రీయ విద్యాలయానికి కదలిక!

కేంద్రీయ విద్యాలయానికి కదలిక!

రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం రాజంపేటలోని కేంద్రీయ విద్యాలయానికి(కేవీ) స్థల గ్రహణం వీడింది. ఈ విద్యాలయం మంజూరుకు లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి కృషి చేశారు. ఫలితంగా 2016లో రాజంపేటలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైంది. దీంతో రాజంపేట పరిసర ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్యను చదువుకొనే అవకాశం కలింగింది.

తొమ్మిదేళ్లుగా...

కేంద్రీయ విద్యాలయం తొమ్మిదేళ్లుగా రాజంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్యాంపస్‌ వెనుక వైపు ఉన్న భవనాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. హాస్టల్‌ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

స్థల ఎంపికలో జాప్యం..

శాశ్వత భవనాల నిర్మాణం కదలిక లేకపోవడానికి ప్రధాన కారణంగా స్థల ఎంపిక నిలుస్తోంది. ముందుగా చుండువారిపల్లె సమీపంలో స్థలాన్ని కేటాయించారు అప్పట్లో అక్కడ కేవీ నిర్మాణం చేపట్టే అవకాశం లేకపోయింది. దీంతో తాత్కాలికంగా సరస్వతీపురంలోని ఒకప్పటి హాస్టల్‌ భవనంలోనే కొనసాగే పరిస్థితి ఏర్పడింది. శాశ్వత నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతూవచ్చింది.

● రాజంపేట–నెల్లూరు రహదారిలోని పోలిగుట్టవద్దే ఎట్టకేలకు శాశ్వత నిర్మాణానికి స్థలం ఎంపిక చేశారు. పోలి పంచాయతీ పరిధిలోని 1815–5 నంబరు, 1615–6 నంబరులో 5 ఎకరాలు కేవీ సొంత భవన నిర్మాణాలకు కేటాయించారు. ఈ స్థలాన్నే ఫైనల్‌ చేశారు. ఈ విషయాన్ని స్ధానిక తహసీల్దారు పీరుమున్నీ ధృవీకరించారు.

నిర్మాణానికి రూ.20కోట్ల నిధుల రెడీ..

కేంద్రీయ విద్యాలయం సొంత భవనాల నిర్మాణానికి రూ.20కోట్ల నిధులు మంజూరయ్యాయి. స్థలం ఎంపిక సమస్యతో ఈ నిధులు వ్యయం కాకుండా ఉండిపోయాయి.ప్రసుతం పనులు చేపట్టడానికి మార్గం సుగమమైంది.

వీడిన స్థలగ్రహణం

ఎంపీ మిథున్‌రెడ్డి కృషితో మంజూరు

పోలిగుట్ట వద్దనే స్థలం ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement