గోనుపల్లి వద్ద ఘోరం! | - | Sakshi
Sakshi News home page

గోనుపల్లి వద్ద ఘోరం!

May 12 2025 12:47 AM | Updated on May 12 2025 12:47 AM

గోనుపల్లి వద్ద ఘోరం!

గోనుపల్లి వద్ద ఘోరం!

రాపూరు : నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గోనుపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. పది మందికిపైగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలం, పెరింపాడు గ్రామానికి చెందిన కుటుంబీకులు సుమారు 23 మంది రాపూరు మండలం, పెంచలకోనలో జరిగే బ్రహ్మోత్సవాలకు ట్రక్కు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ట్రక్కు ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న పెరింపాడుకు చెందిన శివయ్య, రాధమ్మ, నారాయణమ్మకు తీవ్ర గాయాలు కాగా.. మరో పది మందికిపైగా స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది, పోలీసులు, హైవే మొబైల్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

తప్పిపోయిన బాలిక

పోలీసులకు అప్పగింత

రైల్వేకోడూరు అర్బన్‌ : మండలంలోని అనంతరాజుపేట వై.కోట క్రాస్‌ వద్ద తప్పిపోయిన తిరుపతి జీవకోనకు చెందిన నాగమణి అనే బాలికను ఆదివారం వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ సీహెచ్‌ రమేష్‌, అనంతరాజుపేట ఎంపీటీసీ బండారు మల్లికార్జునలు పోలీసులకు అప్పగించారు. వీరి వెంట పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.

బోల్తా పడిన ట్రక్కు ఆటో

పలువురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement