
సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు
రాయచోటి : ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.
నడవలేని స్థితిలో.. :
నడవలేని స్థితిలో పీలేరు నుంచి వికలాంగుడు మోపిరెడ్డి రామమోహన్రెడ్డి తన సమస్య చెప్పుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అతని వద్దకే వెళ్లి సమస్య విన్నారు. అతను ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరిధిలో సమస్యను పరిష్కరించాలని పీలేరు సీఐని ఆదేశించారు. ఎండ వేడిమికి ఉపశమనం కలిగేలా ఫిర్యాదుదారులకు ఎస్పీ ఆదేశాల మేరకు మజ్జిగ, చల్లని నీరు పోలీసులు పంపిణీ చేశారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు