ఎర్రచందనం కేసులో ఇద్దరికి జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం కేసులో ఇద్దరికి జైలుశిక్ష

May 3 2025 7:34 AM | Updated on May 3 2025 7:34 AM

ఎర్రచందనం కేసులో ఇద్దరికి జైలుశిక్ష

ఎర్రచందనం కేసులో ఇద్దరికి జైలుశిక్ష

సిద్దవటం : ఎర్రచందనం కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించినట్లు సిద్దవటం రేంజర్‌ బి.కళావతి తెలిపారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సిద్దవటం రేంజ్‌లో ఎర్రచందనం తరలింపుపై సిద్దవటం మండలం మాధవరం గ్రామానికి చెందిన రామేటి సుబ్బరాజు, కడప మలినేనిపట్నానికి చెందిన గంపాల యల్లయ్యలపై కేసు నమోదైందన్నారు. ముత్తుకూరు బీట్‌లో రూ.47 కిలోల ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement