టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

May 1 2025 2:04 AM | Updated on May 1 2025 2:04 AM

టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

గుర్రంకొండ : జిల్లాలో టమాటా రైతులు పండించిన టమాటాకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, జిల్లాకు హంద్రీనీవా నీళ్లు అందించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మండలంలోని తరిగొండ, మర్రిపాడు, టి.రాచపల్లె, రామాపురం గ్రామాల్లో పర్యటివంచారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు వారాల తరబడి బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. జిల్లాలోని పడమటి మండలాల్లో సాగు నీరు లేక భుగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపోతున్నాయన్నారు. తద్వారా చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ ప్రాంతానికి వెంటనే హంద్రీనీవా నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. క్యాక్రమంలో జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు రమేష్‌బాబు, నాయకులు వెంక్రటమణ, సుధాకర్‌రెడ్డి, రెడ్డెప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement