
వైవీయూ దూర విద్య పీజీ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్: వైవీయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ పీజీ మొదటి,రెండవ సెమిస్టర్ల ఫలితాలను సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీవోఈ) డైరెక్టర్ ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్ బాబుతో కలసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ 1, 2వ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించామన్నారు. ఫస్ట్ సెమిస్టర్ ఆర్థికశాస్త్రం, ఇంగ్లీష్ , చరిత్ర, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, రాజకీయ శాస్త్రం, మనస్తత్వశాస్త్రం వాణిజ్య శాస్త్రం కోర్సులలో వంద శాతం ఉత్తీర్ణత లభించిందన్నారు. ప్రత్యేక తెలుగులో 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల కోసం దరఖాస్తు చేసుకోండి
రాయచోటి టౌన్: జిల్లాలో డ్రెవర్ శిక్షణ కేంద్రాలను నిర్వహించడానికి ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా డీటీఓ ప్రసాద్ సూచించారు. బుధవారం రాయచోటి డీటీఓ కార్యాలయంలో డ్రైవింగ్ స్కూల్ కరస్పాండెంటెంట్లు, విద్యాసంస్థలకు చెందిన వారు, ఎన్ఈవోలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన వారితో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డ్రైవర్ శిక్షణ , పరిశోధన సంస్థ ( ఐడీటీఆర్ర్), జిల్లా శిక్షణ కేంద్రాలు, (డీటీసీలు) ఏర్పాటు కోసం ఎంఓఆర్టీహెచ్చ్ జారీ చేసినట్లు తెలిపారు. అందుకు కావాల్సిన మార్గదర్శకాలను వివరించారు. అర్హత కలిగిన వారు జిల్లా మెజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ ద్వారా రూపొందించిన ప్రొఫార్మా ద్వారా ప్రతిపాదనలు పంపాలని చెప్పారు.
డైట్ అధ్యాపక పోస్టులకు...
రాయచోటి అర్బన్: అన్నమయ్య జిల్లాలోని రాయచోటి విద్యాశిక్షణ సంస్థలో అధ్యాపకులు, సీనియర్ లెక్చరర్లుగా డిప్యూటేషన్ పనిచేయుటకు ఆసక్తి కలిగిన ప్రభుత్వ, జిల్లాపరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ధరఖాస్తులు కోరుతున్నట్లు డైట్ ప్రిన్సిపల్ అజయ్కుమార్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 2025 మార్చి 31 నాటికి దరఖాస్తుదారులకు 58 సంవత్సరాలకు మించకూడదని, కనీసం 5 సంవత్సరాల స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం, ఎంఈఓలుగా పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేట్లో 55 శాతం మార్కులు, ఎంఈడీలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. కనీసస్థాయి కంప్యూటర్పై అవగాహనను కలిగి ఉండాలన్నారు. ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఏప్రిల్ 16,17తేదీలలో రాత పరీక్ష ఉంటుందన్నారు. అర్హులైన వారికి 19వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. సందేహాల వివృత్తి కోసం ఐలయ్య 8790541535, ప్రతాప్ 8328631973 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
పారిశుద్ధ్యం
లోపించకుండా చర్యలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మీ తెలిపారు. బుధవారం ఒంటిమిట్ట బస్టాండ్లో పారిశుద్ధ్యాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలోని దుకాణాల వద్ద పేరుకుపోయిన చెత్తను దుకాణాదారులతో శుభ్రం చేయించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆరు మండలాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒంటిమిట్ట కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎక్కడేగాని పారిశుద్ధ్య లోపం అనేది కనిపించకూడదని పంచాయతీ కార్యదర్శులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో పంచాయతీశాఖ తరపున ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ విజయభాస్కర్, డీఓపిఆర్డీ కెఆర్ఎం ప్రసాద్, ఏఓ చాంద్ బాష, ఆరు మండలాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

వైవీయూ దూర విద్య పీజీ ఫలితాలు విడుదల