పాతాళగంగలో దూకి మరణిస్తా.. భర్తకు వాట్సప్ మెసేజ్
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలోని పాతాళగంగలో దూకి మరణిస్తానని నంద్యాలకు చెందిన కృష్ణకుమారి తన భర్తకు వాట్సాప్ ద్వారా శనివారం సందేశం పంపించింది. అనంతరం ఆమె అదృశ్యమైంది. దీంతో మత్స్యకారుల సహకారంతో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని వన్టౌన్ ఎస్ఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయా ల్సిందిగా కోరారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ మెసేజ్ పంపినట్లు తెలుస్తుంది.
చదవండి: (అయ్యా నా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.. వెంటనే ఆస్పత్రికి కోటంరెడ్డి)
సంబంధిత వార్తలు