
తిరుపతి: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే కాలినడక భక్తుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి. తమిళనాడు హోసూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 300 కి.మీ కాలి నడకన వచ్చిన భక్తులను కలిసిన క్రమంలో వారితో భూమన మాట్లాడారు.
శ్రీనివాస మంగాపురం శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులతో భూమన మాట్లాడారు. భగవంతుడు ఎల్లప్పుడూసామాన్య భక్తుల పక్షాన ఉంటారన్నారు. కాలినడక భక్తుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భూమన తెలిపారు.