85.29 శాతానికి పెరిగిన రికవరీ రేటు | Corona Virus‌ Tests Crossed 49 lakhs In AP | Sakshi
Sakshi News home page

85.29 శాతానికి పెరిగిన రికవరీ రేటు

Sep 19 2020 4:37 AM | Updated on Sep 19 2020 7:53 AM

Corona Virus‌ Tests Crossed 49 lakhs In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారానికి రికవరీ రేటు 85.29 శాతానికి చేరింది. 24 గంటల్లో 74,710 మందికి కోవిడ్‌ టెస్టులు చేయగా 8,096 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 49,59,081 పరీక్షలు నిర్వహించగా 6,09,558 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

5,19,891 మంది కోవిడ్‌ బారినుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 84,423 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 67 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,244కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.  రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా మిలియన్‌ జనాభాకు 92,867 టెస్టులు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement