గంగదేవిపల్లిలో ఉమ్మడి జిల్లా ‘సీడీసీ’ బృందం అధ్యయనం | - | Sakshi
Sakshi News home page

గంగదేవిపల్లిలో ఉమ్మడి జిల్లా ‘సీడీసీ’ బృందం అధ్యయనం

Dec 6 2025 7:42 AM | Updated on Dec 6 2025 7:42 AM

గంగదేవిపల్లిలో ఉమ్మడి జిల్లా ‘సీడీసీ’ బృందం అధ్యయనం

గంగదేవిపల్లిలో ఉమ్మడి జిల్లా ‘సీడీసీ’ బృందం అధ్యయనం

గీసుకొండ: జాతీయ ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన తెలంగాణలోని వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధిని శ్రీసత్యసాయి జిల్లా అగళి, అనంతపురం జిల్లా పుట్లూరు మండలాలకు చెందిన కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు శుక్రవారం అధ్యయనం చేశారు. రాయలసీమ డెవలప్‌మెంట్‌ ట్రస్టు సీనియర్‌ ట్రస్టీ రామాంజనేయులు, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ ఓబులేసు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు నాగమణి, ఆంజనేయులు, బాలవికాస సీనియర్‌ అసోసియేట్‌ కొట్టె రమాదేవితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామం సాధించిన ప్రగతి, విజయాలను జిల్లా ట్రైనింగ్‌ మేనేజర్లు కూసం రాజమౌళి, వనపర్తి కరుణాకర్‌ వివరించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు మేడిద సుశీల, గూడ సరోజన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement