28న డీఈఓ పోస్టుల భర్తీకి పరీక్ష | - | Sakshi
Sakshi News home page

28న డీఈఓ పోస్టుల భర్తీకి పరీక్ష

Oct 26 2025 8:45 AM | Updated on Oct 26 2025 8:45 AM

28న డీఈఓ పోస్టుల  భర్తీకి పరీక్ష

28న డీఈఓ పోస్టుల భర్తీకి పరీక్ష

అనంతపురం మెడికల్‌: డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈఓ) పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 28న ఉదయం 9 గంటలకు జేఎన్‌టీయూలోని సెంట్రల్‌ కంప్యూటర్‌ సెంటర్‌లో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబదేవి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో డీఈఓ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థుల జాబితాను అనంతపురం వెబ్‌సైట్‌లో ఉంచామని, అర్హత సాధించిన వారు పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

వైఎస్సార్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కృష్ణారెడ్డి

అనంతపురం: వైఎస్సార్‌సీపీ అనుబంధ వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోతంశెట్టి కృష్ణారెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement