
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
గుత్తి: ప్రస్తుతం ప్రపంచమంతా కంప్యూటర్ చుట్టూ తిరుగుతోందని, సాంకేతికతను అందిపుచ్చుకుంటే సులువుగా మంచి భవిష్యత్తు అందుతుందని గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా అన్నారు. గుత్తిలోని కోట ఉన్నత పాఠశాలలో వెబ్ టెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను మంగళవారం డీఆర్ఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ జ్ఞానం ఉంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. రోజూ కనీసం గంట పాటైనా సాధన చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, వెబ్ టెక్ కంపెనీ ప్రతినిధి రాజీవ్, సీనియర్ డీఎంఈ ప్రమోద్, ఎంఈఓ రవి నాయక్, హెచ్ఎం సుబహాన్ మాట్లాడుతూ కంప్యూటర్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, గుంతకల్లు సీనియర్ డీఎంఈ రామాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
● కాగా, గుత్తి ఆర్ఎస్లో టెన్నిస్ కోర్టును డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా ప్రారంభించారు. గుత్తి కోటను సందర్శించారు. డీజిల్షెడ్ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో గుత్తి, గుంతకల్లు సీనియర్ డీఎంఈలు ప్రమోద్, మంగాచారి, రైల్వే ఇన్స్టిట్యూట్ చైర్మన్ నేత చంద్ర పాల్గొన్నారు.
గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా