కల్వర్టుపై దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు | - | Sakshi
Sakshi News home page

కల్వర్టుపై దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు

Jun 25 2025 6:42 AM | Updated on Jun 25 2025 6:42 AM

కల్వర్టుపై దూసుకెళ్లిన  ప్రైవేటు బస్సు

కల్వర్టుపై దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు

రాయదుర్గం టౌన్‌: మండలంలోని జుంజురాంపల్లి సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి కల్వర్టుపై దూసుకెళ్లింది. రోజూ మంగళవారం మధ్యాహ్నం బెళుగుప్ప నుంచి గుండ్లపల్లి, కెంచానపల్లి మీదుగా బెంగళూరుకు ఎస్‌ఆర్‌జే ప్రైవేటు బస్సు వెళుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం బెళుగుప్ప నుంచి బయల్దేరిన బస్సు జుంజురాంపల్లి సమీపంలోకి చేరుకోగానే కల్వర్టుపై దూసుకెళ్లి నిలిచిపోయింది. ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

మెట్లపై నుంచి

జారిపడి వ్యక్తి మృతి

బత్తలపల్లి: మేడపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారి కిందపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కడప జిల్లా వేంపల్లి మండలం అయ్యవారిపల్లికి చెందిన కోనేటి సుధాకర్‌ (38) బతుకుదెరువు నిమిత్తం 11 ఏళ్ల క్రితం బత్తలపల్లికి వచ్చాడు. ఆర్డీటీ ఆస్పత్రి సమీపంలో టిఫెన్‌ హోటల్‌ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 20న రాత్రి మిద్దైపె పడుకునేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో భార్యతోపాటు స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం.. అటు నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement