రాయితీతో సూక్ష్మ సేద్యం పరికరాలు | - | Sakshi
Sakshi News home page

రాయితీతో సూక్ష్మ సేద్యం పరికరాలు

Jun 25 2025 6:42 AM | Updated on Jun 25 2025 6:42 AM

రాయితీతో  సూక్ష్మ సేద్యం పరికరాలు

రాయితీతో సూక్ష్మ సేద్యం పరికరాలు

గార్లదిన్నె: ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్యం పరికరాలను అందజేస్తున్నట్లు ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి తెలిపారు. గార్లదిన్నె మండలం యర్రగుంట్ల, ముకుందాపురం గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన పీడీ రఘునాథరెడ్డి మాట్లాడుతూ 5 ఎకరాల వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, 10 ఎకరాల వరకు భూమి ఉన్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు 90 శాతం సబ్సిడీతో 10 ఎకరాలు పైబడి భూమి ఉన్న రైతులకు 50 శాతం సబ్సిడీతో డ్రిప్పు, స్ప్రింక్లర్లను అందజేస్తామన్నారు. సూక్ష్మ సేద్యం పరికరాలు అవసరమున్న రైతులు ఆర్‌ఎస్‌కేల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ విస్తరణాధికారి రామాంజనేయులు, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement