
పక్కా ప్లాన్తోనే దాడి..
పోలీసులు ఆటంకాలు సృష్టించినా...వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు పేరూరుకు చేరుకున్నారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడే మకాం వేసిన టీడీపీ అల్లరిమూకలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెళ్లిన వాహనాలపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ రౌడీలు రాళ్లు రువ్వగా.. వాహనాలు ధ్వంసమయ్యాయి.
టీడీపీ సంబరాలు..
వైఎస్సార్సీపీ నేతల పర్యటన గురించి తెలిసిన వెంటనే గొడవలకు ప్లాన్ చేసిన టీడీపీ నేతలు.. ఉన్నఫలంగా పేరూరులో సంబరాలు చేశారు. తల్లికి వందనం విడుదల సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చి మద్యం తాగి నానా రభస చేశారు.