
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావ
‘తల్లికి వందనం’..
తప్పులతో ఎగనామం
పెద్దవడుగూరు: ‘తల్లికి వందనం’ వివరాల నమోదు తప్పులతడకగా ఉండటంతో అర్హత కలిగిన పలువురికి పథకం వర్తించలేదు. ఎవరో చేసిన తప్పిదాలకు తమకు లబ్ధి చేకూరకుండా ఎగనామం పెట్టారని బాధితులు వాపోతున్నారు. వ్యవసాయ భూమి తక్కువ ఉన్నా 10 ఎకరాలకు పైబడి ఉందని అనర్హుల జాబితాలో చేర్చారని పెద్దవడుగూరు మండలం ముప్పాలగుత్తికి చెందిన ఆదినారాయణ, లక్ష్ముంపల్లికి చెందిన రెడ్డిపల్లి సుధాకర్రెడ్డి, పుల్లన్న తెలిపారు. సుధాకర్రెడ్డికి 3 ఎకరాల పొలం ఉంటే.. పది ఎకరాలు ఉన్నట్లు చూపారు. ముప్పాలగుత్తి గ్రామంలో చంద్రశేఖర్ అనే వ్యక్తికి వ్యవసాయ భూమి లేకున్నా అనర్హుల జాబితాలో పేరు వచ్చింది. ధనలక్ష్మి, సుజాతకు కూడా భూమి తక్కువ ఉన్నా ఎక్కువగా ఉన్నట్లు నమోదవడంతో లబ్ధి పొందలేకపోయారు. మరికొందరికి ఇద్దరు పిల్లలు ఉన్న చోట ఒకరికి మాత్రమే రూ.13వేలు వర్తింపజేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులను వివరణ కోరగా తక్కువ భూమి ఉన్నా.. రీ సర్వే జరిగిన గ్రామాల్లో వారి భూముల సమస్యలను అలాగే పెట్టుకోవడం వల్ల జాయింట్ ఎల్పీఎం కింద భూములు ఉన్న రైతులు అనర్హులుగా మారిపోయారని తహసీల్దార్ ఉషారాణి తెలిపారు. మండలంలోని 15 గ్రామ సచివాలయాల్లో దాదాపు 6,088 మందికి పథకం వర్తించగా.. 808 మందిని అనర్హుల జాబితాలో ఉంచారు. అర్హత ఉన్నా డబ్బు పడని వారి నుంచి అర్జీలు స్వీకరించి.. పరిష్కారం చేస్తామని ఎంపీడీఓ బారన్సాహెబ్ తెలిపారు.
రీకౌంటింగ్ గడువు ఈ నెల 19
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రీ కౌంటింగ్కు రూ.500, రీ వెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రాలు పొందేందుకు రూ.1000 ఫీజు చెల్లించాలన్నారు. పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత దరఖాస్తులు స్వీకరించబోమని తెలియజేశారు.