
ఉదిరిపికొండలో ట్యాంకర్లతో నీటి సరఫరా
కూడేరు: ఉదిరిపికొండలో ట్యాంకర్లతో అధికారులు నీటి సరఫరా చేపట్టారు. ‘తార స్థాయికి దాహం కేకలు’ అనే శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. కూడేరు మండల పరిధిలోని ఉదిరిపికొండలో రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసి మంచి నీటిని సరఫరా చేశారు. అదే విధంగా సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ నుంచి కూడా నీటిని సరఫరా చేశారు. గ్రామంలో అదనంగా బోరు కూడా వేయిస్తామని అధికారులు తెలిపారు. 20 రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఎట్టకేలకు నీరు సరఫరా కావడంతో సమస్య కొంత వరకు తీరింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఉదిరిపికొండలో ట్యాంకర్లతో నీటి సరఫరా

ఉదిరిపికొండలో ట్యాంకర్లతో నీటి సరఫరా