
నాడు
జిల్లాలో చౌక ధరల దుకాణాలు 1,645 రేషన్కార్డు దారులు 6,60,330 ఎండీయూ వాహనాలు 405 వాహనాలపై ఆధారపడిన నిరుద్యోగులు 810 మంది
నేడు
పొట్ట కొట్టి.. అవస్థలు తెచ్చిపెట్టి!
● కూటమి సర్కార్ కక్ష సాధింపు
● ఎండీయూ వాహనాల రద్దు
● రేషన్ దుకాణాల వద్దే సరుకులు తీసుకునేలా ఆదేశాలు
● ఎండీయూ వాహనదారులు, ఆపరేటర్లకు ఉపాధి కోత
● ‘పాత’ కష్టాలు తలచుకుని కార్డుదారుల గగ్గోలు
రాయదుర్గం: పేదల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్కు పేరొస్తుందనే అక్కసుతో నిర్దయగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. ఇంటింటా బియ్యం పంపిణీ చేసే ఎండీయూ వాహన వ్యవస్థను రద్దు చేసింది. ఎండీయూ వాహనాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నిరుద్యోగుల పొట్టకొట్టింది. మరోవైపు కూటమి సర్కారు చర్యలపై కార్డుదారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. బియ్యం, పప్పుల కోసం ఇక ప్రతి నెలా కుస్తీలు పట్టాల్సి వస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రశంసలు..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల కోసం ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఎండీయూ వాహనాల్లో త్రాసుతో తూకం వేసి బ్యాగులో బియ్యం పోసేవారు. 20 కిలోల కార్డుకు ఆ మేర తూకం పడితేనే సిగ్నల్ చూపేది. గతంలో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేసే క్రమంలో తకరారు చేసి కొంత మిగుల్చుకునేవారు. దీంతో కార్డుదారులకు నష్టం చేకూరేది. అలాంటి అవకతవకలకు చెక్ పెడుతూ పేదలకు సౌలభ్యంగా ప్రవేశపెట్టిన విధానాన్ని మరింత మెరుగుపర్చాల్సింది పోయి పూర్తిగా ఊపిరి తీస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కుటుంబం వీధిన పడుతుంది
గతంలో కూలి పనిచేసుకునేదాన్ని. మాకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎండీయూ మంజూరు కావడంతో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో గౌరవంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా బాబు వలంటీర్గా ఉండేవాడు. అది తొలగించారు. ఇప్పుడు వాహనాలను తొలగిస్తే మా కుటుంబం వీధిన పడుతుంది.
–బండి ముంతాజ్, వైఎస్సార్ కాలనీ, కురుగుంట
కంతులు ఎలా చెల్లించాలి?
ఎండీయూ వాహనాల్ని రద్దు చేయడంతో ఆపరేటర్లు చిక్కుల్లో పడినట్లయింది. వాహనాలకు సంబంధించి నెలవారీ కంతులు బ్యాంకులకు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ఆపరేటర్లకే కాదు, కార్డుదారులకూ ఇబ్బందులు తప్పవు. అందరినీ దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వ్యవస్థపై ప్రభుత్వం పునరాలోచించాలి. తగిన నిర్ణయం తీసుకోవాలి.
– సుధాకర్, ఎండీయూ ఆపరేటర్,
రాయదుర్గం
అనంతపురం అర్బన్: ‘‘ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలను తొలగించి మా పొట్ట కొట్టొద్దు. ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు రోడ్డున పడతాయి‘‘ అంటూ ఎండీయూ నిర్వాహకులు పేర్కొన్నారు. ఎండీయూ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ఎండీయూ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు మాట్లాడుతూ ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థలో భాగంగా 2021 నుంచి జిల్లాలో 405 వాహనాల నిర్వాహకులు జీవనోపాధి పొందుతున్నామన్నారు. ఎండీయూ వాహనాలు తొలగిస్తే తమతో పాటు హెల్పర్లుగా ఉన్నవారు కూడా ఉపాధి కోల్పోయి వీధిన పడతారన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బాబావలి, బాబ్జాన్, ఖాసీమ్, గంగాధర్, గణేష్, హనుమంత, పోతయ్య, బషీర్, రమేష్, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.
నిర్దయపై నిరసనాగ్రహం

నాడు

నాడు

నాడు

నాడు