పరిశ్రమలు స్థాపించకపోతే ప్లాట్లు రద్దు | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు స్థాపించకపోతే ప్లాట్లు రద్దు

Apr 30 2025 2:02 AM | Updated on Apr 30 2025 2:02 AM

పరిశ్రమలు స్థాపించకపోతే ప్లాట్లు రద్దు

పరిశ్రమలు స్థాపించకపోతే ప్లాట్లు రద్దు

రాయదుర్గం: పట్టణ శివారులోని ఉడేగోళం వద్ద టెక్స్‌టైల్‌ పార్కులో యూనిట్లు నెలకొల్పకుండా వృఽథాగా వదిలేసిన వారి ప్లాట్లను రద్దు చేసి కొత్త వారికి అవకాశం కల్పించాలని చేనేత జౌళి శాఖ అధికారులను కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. పరిశ్రమల స్థాపన అంశంపై రాయదుర్గంలోని మార్కెట్‌యార్డులో మంగళవారం కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దున ఉన్న రాయదుర్గంలో పరిశ్రమల స్థాపనకు ఔత్సహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో టెక్స్‌టైల్‌ పార్కులో ప్లాటు పొంది యూనిట్లు నెలకొల్పకుండా ఉన్నవారితో చర్చించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వారు సానుకూలత వ్యక్తం చేయకపోతే ఒకటి లేదా రెండు నెలల గడువిచ్చి ఆ తర్వాత ప్లాట్లను రద్దు చేసి, ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన్‌ రహర్‌, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, చేనేత జౌళిశాఖ సహాయకులు శ్రీనివాసరెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సుహనా సోనీ, జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు, రాయదుర్గం టెక్స్‌టైల్‌ పార్కులో ప్లాటు పొందిన యజమానులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ కాలవ, కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement