ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు గణితం సబ్జెక్టులోనే ఫెయిల్‌ అయ్యారు. మొత్తం 30,700 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 21,510 మంది 70.07 శాతం మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. 29.93 శాతంతో 9,190 మంది విద్యార | - | Sakshi
Sakshi News home page

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు గణితం సబ్జెక్టులోనే ఫెయిల్‌ అయ్యారు. మొత్తం 30,700 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 21,510 మంది 70.07 శాతం మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. 29.93 శాతంతో 9,190 మంది విద్యార

Apr 30 2025 1:52 AM | Updated on Apr 30 2025 1:52 AM

ఇటీవల

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ఎక్కువ మంది

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇటీవల వెలువడిన పదోతరగతి పరీక్షల్లో అనంతపురం నగర పరిధిలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఏదో ఒక సబ్జెక్‌లో ఫెయిల్‌ అయ్యారు. అనంతపురంలో తెలుగు పరీక్ష రాసిన విద్యార్థుల్లో అత్యధికంగా 475 మంది ఫెయిల్‌కాగా, అత్యల్పంగా పుట్లూరు మండలంలో 21 మంది తప్పారు. హిందీ పరీక్షలో అనంతపురంలో 104 మంది ఫెయిల్‌ కాగా అత్యల్పంగా పెద్దవడుగూరు మండలంలో ఏడుగురు, ఇంగ్లిష్‌ పరీక్ష అనంతపురంలో 237 మంది ఫెయిల్‌ కాగా అత్యల్పంగా పెద్దవడుగూరు మండలంలో ఆరుగురు, గణితం పరీక్ష అనంతపురంలో 962 మంది ఫెయిల్‌ కాగా అత్యల్పంగా పెద్దపప్పూరు మండలంలో 66 మంది, సైన్స్‌ పరీక్ష అనంతపురంలో 684 మంది ఫెయిల్‌ కాగా అత్యల్పంగా పెద్దపప్పూరు మండలంలో 51 మంది, సోషల్‌ పరీక్ష అనంతపురంలో 585 మంది ఫెయిల్‌ కాగా అత్యల్పంగా పుట్లూరు మండలంలో 23 మంది ఉత్తీర్ణత తప్పారు.

రేపటి నుంచి ప్రత్యేక తరగతులు

ఫెయిల్‌ అయిన విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మే 19 నుంచి జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో వీలైనంత మందిని గట్టెక్కించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఫెయిలైన విద్యార్థులకు మే 1 (రేపటి) నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభం కానున్నాయి. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఫెయిల్‌ అయిన విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి మండలంలో 2 నుంచి 3 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల అనుకూలాన్ని బట్టి ఆయా కేంద్రాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకుంటున్నారు. మండలంలోని ఉన్నత పాఠశాలల నుంచి టీచర్లు హాజరయ్యేలా షెడ్యూలు ఖరారు చేశారు. కేటాయించిన తేదీల్లో ఖచ్చితంగా ఆయా సబ్జెక్టు టీచర్లు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మునిసిపాలిటీ, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. కేజీబీవీ పాఠశాలల్లో ఈ శిక్షణ ఇప్పటికే ప్రారంభమైంది.

పదో తరగతిలో అత్యధికంగా 7,012 మంది విద్యార్థులు ‘గణితం’లో ఫెయిల్‌

ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు రేపటి నుంచి ప్రత్యేక తరగతులు

అన్ని మండలాల్లోనూ అమలుకు విద్యాశాఖ చర్యలు

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ఎక్కువ మంది1
1/1

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ఎక్కువ మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement