
పీఏబీఆర్లో తగ్గిన నీటిమట్టం
కూడేరు: ఇన్ఫ్లో లేక కూడేరు మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం తగ్గింది. ఆదివారం నాటికి రిజర్వాయర్లో 2.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. జలాశయం వద్ద ఏర్పాటైన అనంతపురం, శ్రీసత్యసాయి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్లకు రోజుకు సుమారు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీ, ఆవిరి రూపంలో సుమారు 60 క్యూసెక్కుల వరకు నీరు బయటకు వెళుతోంది.
సాయి నామమే మధురం
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా సత్యసాయి భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో బాలవికాస్, సత్యసాయియూత్ బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు.

పీఏబీఆర్లో తగ్గిన నీటిమట్టం